సీఎం పర్యటన ఏర్పాట్లపై దృష్టి

సీఎం పర్యటన ఏర్పాట్లపై దృష్టి

కోస్గి, వెలుగు :  వచ్చే నెల 5న సీఎం రేవంత్​రెడ్డి కొడంగల్  నియోజకవర్గ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మంగళవారం నారాయణపేట, వికారాబాద్  జిల్లాల కలెక్టర్లు కోయశ్రీహర్ష, నారాయణరెడ్డి, ఎస్పీలు యోగేశ్ గౌతమ్, కోటిరెడ్డి, కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి తిరుపతిరెడ్డి కోస్గి పట్టణంలో హెలీప్యాడ్  స్థలాన్ని పరిశీలన చేశారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు సీఎం వస్తున్నారని, సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు. నారాయణపేట, వికారాబాద్​ అడిషనల్​ కలెక్టర్లు మయాంక్  మిత్తల్, లింగ్యానాయక్​  ఉన్నారు.