రైతుల ఫిర్యాదులతో .. రఘునాథపల్లిలోని ఎరువుల షాపుల్లో తనిఖీలు

రైతుల ఫిర్యాదులతో .. రఘునాథపల్లిలోని ఎరువుల షాపుల్లో  తనిఖీలు

రఘునాథపల్లి/ దంతాలపల్లి, వెలుగు: ఫర్టిలైజర్​ దుకాణాల్లో ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో అగ్రికల్చర్​ మండల ఆఫీసర్​ శ్రీనివాస్​రెడ్డి, ఎస్సై నరేశ్​యాదవ్, మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల షాప్​లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా వారు స్టాక్​ రిజిస్టర్లను పరిశీలించి విత్తన, ఎరువుల విక్రయాలపై ఆరా తీశారు. విత్తనాల కొనుగోలులో రైతులు, షాప్​ నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.