మంత్రి కేటీఆర్ సభకు రాకుంటే లోన్లు అడగొద్దు

మంత్రి కేటీఆర్ సభకు రాకుంటే లోన్లు అడగొద్దు
  • మహిళా సంఘాల సభ్యులకు  బెదిరింపులు  

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్​లో సోమవారం జరుగనున్న మంత్రి కేటీఆర్​ సభను సక్సెస్​ చేసేందుకు బీఆర్​ఎస్​ నాయకులు, అధికారులు తిప్పలు పడుతున్నారు. మంత్రి సభకు పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేయాలని ఆదేశాలు రావడంతో మహిళా సంఘాలపై దృష్టి సారించారు. మంత్రి సభకు రావాలని మహిళా సంఘాల సభ్యులను ఆర్​పీలు బెదిరిస్తున్నారు.

‘రేపు ఉదయం 9.30 గంటలకు మంత్రి కేటీఆర్ ​గారు వస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆ మీటింగ్​కు హాజరుకావాలి. అక్కడ లంచ్ కూడా అరేంజ్​ చేశారు. మా పై అధికారులు మాకు మెమోలు ఇస్తాం అన్నారు. నేను సీరియస్​గా చెబుతున్నా. మంత్రి సభకు రానివాళ్లు ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి లోన్​ కావాలని అడగొద్దు’  అంటూ ఆర్​పీలు మహిళా సంఘాలకు వాట్సాప్​ద్వారా వార్నింగ్​మెసేజ్​లను పంపుతున్నారు.