
ఓలా ఎలక్ట్రిక్ తమ ‘డిసెంబర్ టూ రిమంబర్’ క్యాంపెయిన్ను హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా న్యూ ఎస్1 ఎక్స్+ బైక్ ధరను రూ.20 వేలు తగ్గించి రూ.90 వేలకు అమ్ముతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ అమర్చారు. ఫుల్ ఛార్జింగ్పై 151 కి.మీ వెళుతుందని, టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లని ఓలా పేర్కొంది.