రాష్ట్రంలో మళ్లీ 2వేలు దాటిన రోజువారీ కేసులు

రాష్ట్రంలో మళ్లీ 2వేలు దాటిన రోజువారీ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న 1920మందికి కరోనా సోకగా.. ఈ రోజు ఆ సంఖ్య 2వేలు దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 90.021 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,319 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. వీరిలో 1,275 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,00,094కు చేరింది. ఈ రోజు కరోనా కారణంగా ఇద్దరు చనిపోయారు. గత 24 గంటల్లో 474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 యాక్టివ్ కేసులున్నాయి. 

మరిన్ని వార్తల కోసం..

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

రోడ్డుపై గుట్టలుగా రూ.2000 నోట్ల కట్టలు