
న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్లో గోల్డ్ నెగ్గి చరిత్ర సృష్టించిన ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నారు. మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో ఆరు నుంచి ఐదో స్థానానికి చేరుకున్నారు. ధ్రువ్–ఎంఆర్ అర్జున్ జంట నాలుగు స్థానాలు మెరుగై 23వ ర్యాంక్ అందుకుంది. మెన్స్ సింగిల్స్లో ప్రణయ్ తొమ్మిదో ప్లేస్లో ఉండగా.. శ్రీకాంత్, లక్ష్యసేన్ వరుసగా 22, 23వ ర్యాంక్ల్లో నిలిచారు. విమెన్స్లో పీవీ సింధు 12వ ర్యాంక్కు పడిపోయింది. డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జంట రెండు ర్యాంక్లు మెరుగై 17వ స్థానానికి చేరుకుంది.