
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద రాజీవ్ రహదారిపై కారు, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన కొంగారి మృత్యుంజయ్(32), భార్య, కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం కారులో కరీంనగర్వచ్చాడు. రాత్రి తిరిగి వెళ్తుండగా కారు ఇందిరానగర్ చేరుకోగానే మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ను ఢీకొట్టింది.
దీంతో అదుపుతప్పి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపునకు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న మృత్యుంజయ్ స్పాట్లోనే చనిపోయాడు. మిగతావారు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు.