ట్రాక్టర్తో దున్నుతుండగా విషాదం

ట్రాక్టర్తో దున్నుతుండగా విషాదం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో విషాదం జరిగింది. మానకొండూరు మండలం బంజేరుపల్లికి చెందిన రైతు  శంకర్  గురువారం సాయంత్రం పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు  ట్రాక్టర్ తో సహా బావిలో పడిపోయాడు. ఆ సమయంలో ట్రాక్టర్ పైనున్న మరో వ్యక్తి  అప్రమత్తమై కిందకు దూకాడు. శంకర్ మాత్రం ట్రాక్టర్ తో సహా బావిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బావిలో నీళ్లు ఎక్కువగా ఉండటం, వర్షం కూడా కురవడం, చీకటి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. శంకర్ బావిలో పడిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.