ఇస్లామాబాద్: భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తమ భద్రతా బలగాలకు దేవుడి సహాయం అందిందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో దైవ సహాయాన్ని తాము ఫీల్ అయ్యామన్నారు. ఇటీవల ఇస్లామాబాద్లో నిర్వహించిన నేషనల్ ఉలేమా కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఆ స్పీచ్ను ఆదివారం పాక్లో కొంతవరకు మాత్రమే టెలికాస్ట్ చేశారు. పహల్గాం టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా పాక్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడి చేశాయి. ఈ ప్రతీకార దాడిలో ఉగ్రవాద స్థావరాలు తునాతునకలయ్యాయి. నాలుగు రోజులు ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.
