- బీఎస్పీ, బీజేడీ, బీఆర్ఎస్ పార్టీలకు అందని ఆహ్వానం
న్యూఢిల్లీ : రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు శుక్రవారం బీహార్ రాజధాని పాట్నాలో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్కు హాజరు కావాలని వివిధ పార్టీల నేతలను బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ వ్యక్తిగతంగా ఆహ్వానించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ గురువారమే పాట్నా చేరుకున్నారు.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ను ఆమె కలిశారు. అయితే, ఈ మీటింగ్కు హాజరుకానని బీఎస్పీ చీఫ్ మాయావతి ట్వీట్ చేశారు. ఈ మీటింగ్కు మాయావతి(బీఎస్పీ)తో పాటు నవీన్ పట్నాయక్(బీజేడీ), కేసీఆర్(బీఆర్ఎస్)లను పిలవలేదని జేడీయూ తెలిపింది.