
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థిని, పరిశోధకురాలు జంగంపల్లి వర్ష ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపును పొందారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూషన్ సహకారంతో గీతంలో ఆప్టోమెట్రీ కోర్సు నిర్వహిస్తున్న వర్షకు ఇండియన్ విజన్ ఇన్స్టిట్యూట్ బ్రియాన్ హోల్డెన్ యంగ్ ఆప్టోమెట్రీ రీసెర్చర్ రోలింగ్ ట్రోఫీని అందించింది. శుక్రవారం వర్షను గీతం వీసీ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్డాక్టర్ మోతాహర్ రెజా, ఎల్వీపీఈఐ అసోసియేట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఆర్ భరద్వాజ్, రిజిస్ర్టార్ విజయ్ కుమార్ అభినందించారు.
దేశంలో పెరుగుతున్న కంటి సంరక్షణ డిమాండ్లను తీర్చగల ఆప్టోమెట్రీ రంగంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించి, వారి పరిశోధనలకు సహరించేందుకు ట్రోఫీ ప్రతిబింబిస్తుందని ఐవీఐ సీఈఓ వినోద్ డేనియల్ పేర్కొన్నారు. వర్ష పరిశోధనలు భవిష్యత్ ఆప్టోమెట్రీ మార్పులకు ఉపయోగపడుతాయని తెలిపారు.
ఫార్మాస్యూటికల్ రీసెర్చ్లో విజయ్ నాయక్కు పీహెచ్డీ
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ రీసెర్చ్ స్టూడెంట్ భూక్య విజయ్ నాయక్ను డాక్టరేట్ వరించిందని అసోసియేట్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ బేడా తెలిపారు. విజయ్ నాయక్ ఇక్సాజోమిబ్ సిట్రేట్, పనోబిస్టాట్ ప్రసుగ్రెల్ వంటి క్లిష్టమైన ఔషదాల డీపీల వర్గీకరణపై అధునాతన పరిశోధనలు చేశాడని, పీపీఈ పద్దతిని ఉపయోగించి అతి తక్కువ మందం గల ప్లాస్మా నమూనాలతో విజయవంతంగా ప్రాసెస్ చేసి నిరూపించినట్లు వివరించారు. స్థిరమైన ఔషధ పరిశోధనకు కృషి చేసి డాక్టరేట్ సాధించిన విజయ్ నాయక్ను గీతం వీసీ, రెసిడెంట్ డైరెక్టర్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ అభినందించారు.