అన్నాచెల్లెళ్లకు ఓయూ డాక్టరేట్

అన్నాచెల్లెళ్లకు ఓయూ డాక్టరేట్

హాలియా, వెలుగు :  నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు పీహెచ్‌‌‌‌డీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌‌‌‌ పొందారు. నల్గొండ జిల్లా అనుముల మండలం నాయుడుపాలెం గ్రామానికి చెందిన బానావత్ బాలు నాయక్ వ్యాయామ విద్యలో ‘హిస్టారికల్ పర్సిటీ పర్సెప్టిప్​ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్ ప్రో కబడ్డీ ఏ స్టడీ’ అంశంపై ఓయూ  ప్రొఫెసర్ వి. సత్యనారాయణ పర్యవేక్షణలో పీఎచ్​డీని పూర్తి చేశారు.  

ఇతని చెల్లెలు బానావత్ శారద హిస్టరీ విభాగంలో ‘ములుగు జిల్లాలోని గిరిజనుల సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పు’ అంశంపై ప్రొఫెసర్ అంజయ్య పర్యవేక్షణలో పీహెచ్​డీని పూర్తి చేశారు. వీరిద్దరు రెండు రోజుల కింద వర్సిటీ 83వ స్నాతకోత్సవంలో  అడోబ్​ సీఈవో  శంతస్​ నారాయణ, ఓయూ వీసీ డి. రవీందర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు.