మన అతిపెద్ద మతం.. మానవత్వం

మన అతిపెద్ద మతం.. మానవత్వం

 మాకు దేశమే తొలి ప్రాధాన్యం: ఇమామ్ ఉమెర్ అహ్మద్ ఇల్యాసి

అయోధ్య : శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (ఏఐఐవో) చీఫ్ ఇమామ్ ఉమెర్ అహ్మద్ ఇల్యాసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది నవభారత ముఖచిత్రం... మన అతిపెద్ద మతం మానవత్వమే... మాకు దేశమే తొలి ప్రాధాన్యం’’అని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకగా ఎంతో అద్భుతంగా జరిగిందని కొనియాడారు. ఈ వేడుకకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు ధన్యవాదాలు తెలిపారు. పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్​షాతో కూడా భేటీ అయినట్టు గుర్తు చేశారు. సద్గురు జగదీశ్ వాసుదేవ్​తో కూడా చర్చా వేదికలు పంచుకున్నట్టు చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్​తో కూడా 2022, సెప్టెంబర్​లో ఇల్యాసి భేటీ అయ్యారు. మోహన్​ భగవత్​ను జాతిపితగా అభివర్ణించారు.