ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా పి. శ్రావణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సీడీఎంఏ ఆదేశాల మేరకు తొలి పోస్టింగ్ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా వచ్చారు. ఇదివరకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న రాజు 18 రోజుల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. దీంతో రవిబాబుకు 13 రోజుల క్రితం ఆర్మూర్ ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలు ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ శ్రావణికి ఆఫీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
