కాలి నడకన గంగోత్రి టు రామేశ్వరం

కాలి నడకన గంగోత్రి టు రామేశ్వరం

పెనుబల్లి, వెలుగు : లోక కల్యాణం కోసం పలువురు సాధువులు ఉత్తరాఖండ్​లోని గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు పాదయాత్ర చేపట్టారు. బిహార్​కు చెందిన సాధువులు మణికంత్ షా, శ్యామ్, రామ్​జీత్, అశుతోష్​, సుధీష్ట్, చిరామ్​జీవ్, లాల్​బచ్చన్ 73 రోజుల కింద గంగోత్రిలో పాదయాత్ర మొదలుపెట్టి మంగళవారం పెనుబల్లి మండలం వియంబంజర్​కు చేరుకున్నారు.

మరో 43 రోజుల్లో కాలినడకన రామేశ్వరం చేరుకుంటామని వారు తెలిపారు. స్థానిక భక్తులు అనుమోలు సాంబశివరావు, వంగా చెన్నారావు సాధువులకు పండ్లు అందజేశారు