
వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్: జులై రావడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే నార్లు సిద్ధం చేసుకున్న రైతులు.. నాట్లు వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి సాగు అధికంగా ఉంటుంది. ఎప్పటిలాగే కూలీల కొరత వేధిస్తుండగా.. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో నాట్లు ముమ్మరం చేశారు.