మా భూమిలో అరుదైన ఖని జాలున్నయ్ ..పెట్టెలో తీసుకొచ్చి ట్రంప్కు చూపించిన పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్

మా భూమిలో అరుదైన ఖని జాలున్నయ్ ..పెట్టెలో తీసుకొచ్చి ట్రంప్కు చూపించిన పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్
  •     
  •     రేర్ ఎర్త్ మినరల్స్ గురించి వివరించగా.. ఆసక్తిగా విన్న ట్రంప్


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల వైట్​హౌస్​లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్​లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలను వాళ్లు ట్రంప్​కు చూపించారు. ఓ చెక్క పెట్టెలో ఖనిజాలు ఉండగా.. వాటి గురించి మునీర్ వివరిస్తున్నారు. ట్రంప్, షెహబాజ్ షరీఫ్ ఇద్దరూ.. ఆసక్తిగా వింటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆదివారం వైట్ హౌస్ రిలీజ్ చేసింది. ఈ భేటీలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఉన్నారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. కాగా, రేర్‌‌‌‌‌‌‌‌ ఎర్త్‌‌‌‌‌‌‌‌ మినరల్స్‌‌‌‌‌‌‌‌లో చైనా ఆధిపత్యానికి గండికొట్టాలని ట్రంప్‌‌‌‌‌‌‌‌ ఎప్పటి నుంచో చెప్తున్నారు. దీంతో తాజాగా పాకిస్తాన్​లో రేర్‌‌‌‌‌‌‌‌ ఎర్త్‌‌‌‌‌‌‌‌ మినరల్స్‌‌‌‌‌‌‌‌ ఖజానా ఉందని ట్రంప్​కు మునీర్ వివరించారు. ఫలితంగా వాటి వెలికితీతపై అమెరికా ఆసక్తి కనబరుస్తున్నది. పాకిస్తాన్​లో పాలీ మెటాలిక్‌‌‌‌‌‌‌‌ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఫ్రాంటియర్‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌తో అమెరికాకు చెందిన స్ట్రాటజిక్‌‌‌‌‌‌‌‌ మెటల్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ ఎంవోయూపై సంతకాలు చేశాయి. దీనిలో భాగంగానే అమెరికాకు చెందిన ఓ కంపెనీ 500 మిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు పాక్‌‌‌‌‌‌‌‌లో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం.

పోర్చుగల్​ గ్రీస్ కంపెనీతో సెకండ్​ డీల్ 

నేషనల్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్, పోర్చుగల్​గ్రీస్ ఇంజనీరింగ్, కన్​స్ట్రక్షన్​ కంపెనీకి చెందిన మోటా – ఎంగిల్ గ్రూప్ మధ్య రెండో అగ్రిమెంట్ కుదిరింది. పాకిస్తాన్ భూమి లోపలి నుంచి కాపర్, గోల్డ్, అరుదైన ఖనిజాలతో పాటు ఇతర మినరల్స్ వెలికి తీసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు పోర్చుగల్ ప్రతినిధులు ప్రకటించారు. పాకిస్తాన్​లో అపారమైన ఖనిజ సంపద ఉందని, వీటి విలువ కొన్ని ట్రిలియన్ డాలర్లు ఉంటుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ప్రకటించారు. దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు, రుణాల నుంచి విముక్తి పొందేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమని తెలిపారు. తమ వద్ద రేర్‌‌‌‌‌‌‌‌ ఎర్త్‌‌‌‌‌‌‌‌ మినరల్స్‌‌‌‌‌‌‌‌ ఖజానా ఉందని, దీంతో దేశ రుణభారం చాలా వరకు తగ్గిపోనున్నదని ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పారు. అతి త్వరలోనే పాకిస్తాన్ 
సుసంపన్న దేశంగా మారుతుందని తెలిపారు.