
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటనపై పాకిస్తాన్ ఓ కన్నేసింది. ఈ సందర్భంగా జమ్మూ- కాశ్మీర్లో ఆర్టికల్ -370 లోని నిబంధనలను రద్దు చేసిన తరువాత 2019 ఆగస్టు 5 తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని తెలుపుతూ ట్రంప్ ను ఓ కోరిక కోరింది.
అమెరికా అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంగా జమ్ము- కాశ్మీర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను భారత ప్రభుత్వంతో మాట్లాడేలా ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తే అందుకు తాము సపోర్ట్ చేస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈషా ఫారూకి అన్నారు. రెండు దేశాల ప్రతినిధిలు కలిసిన ప్రతిసారి అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు.