పాలేరు అండర్ టన్నెల్ పనులు వేగవంతం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ​​​​​​​

పాలేరు అండర్ టన్నెల్ పనులు వేగవంతం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ​​​​​​​

కూసుమంచి, వెలుగు: పాలేరు ఎడమ కాలువ యూటీ(అండర్​టన్నెల్) పనులు వేగంగా జరుగుతున్నాయ. రూ.14 కోట్లతో చేపడుతున్న ఈ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్​రెండు షిఫ్టుల్లో పనులు చేయిస్తున్నారు. ఐబీ ఎస్ఈ వెంకటశ్వర్లు, డీఈ మాధవి మంగళవారం పరిశీలించారు. నాణ్యతతో నిర్మాణం చేపట్టాలని సూచించారు.