పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్... చితకబాదిన పేరెంట్స్

పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్... చితకబాదిన పేరెంట్స్

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్​ని పేరెంట్స్ చితకబాదారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేంద్రీయ విశ్వ విద్యాలయంలో లైబ్రేరియన్​ గా పని చేస్తున్న భాను ప్రకాష్​నాయక్​లైబ్రరీ తరగతిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. 

పిల్లల లోదుస్తుల వివరాలు అడుగుతూ.. తన ప్రైవేటు పార్ట్స్​ని వారితో మసాజ్​ చేయించుకునే వాడు.  దీంతో పిల్లలు స్కూల్​కి వెళ్లాలంటేనే భయపడేవారు. పేరెంట్స్ గమనించి ఆగస్టు 14న స్కూలుకు వెళ్లి ప్రకాష్ ని నిలదీశారు. 

పొంతనలేని సమాధానం ఇస్తుండటంతో కోపోద్రిక్తులైన పేరెంట్స్​ అతడ్ని చితకబాదారు. ఈ క్రమంలో పోలీసులు కలగజేసుకుని సర్దిచెప్పారు. ప్రిన్సిపల్​కి గతంలో ఇదే విషయంపై కంప్లెంట్​ చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. 

అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రకాష్​ని వివరణ కోరగా.. గతంలో ఉన్న ప్రిన్సిపల్​తనపై కక్షకట్టి పేరెంట్స్​తో అబద్ధాలు ప్రచారం చేయిస్తూ.. దాడి చేయిస్తున్నారని ఆరోపించాడు.