పొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఎల్లిపాయ కారంతో భోజనమా ?

పొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఎల్లిపాయ కారంతో భోజనమా ?

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్​ స్కూల్​లో స్టూడెంట్లకు ఎందుకు ఎల్లిపాయకారంతో భోజనం పెడుతున్నారని శనివారం నిర్వహించిన పేరెంట్స్​ మీటింగ్​లో తల్లిదండ్రులు ప్రశ్నించారు. 

వివరాల్లోకి వెళ్తే.. కూరగాయల కాంట్రాక్టర్ గడువు ముగియడంతో కొత్తగా ఎవరూ ముందుకు రాకపోవడంతో  నెలరోజులుగా కారంతో భోజనం పెడుతున్నారని, గుడ్డుతో పెట్టిన భోజనంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పేరెంట్స్​ మీటింగ్​లో ప్రిన్సిపల్, టీచర్స్​తో వాగ్వాదానికి దిగారు. 

అనంతరం ఆందోళన చేపట్టడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్య వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తామని ప్రిన్సిపల్​ అజయ్​ సింగ్​ నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.