పార్లమెంట్​ ఎస్టేట్​లో పార్లమెంట్​ భవనం, పార్లమెంట్​ హౌస్​ అనెక్స్

పార్లమెంట్​ ఎస్టేట్​లో పార్లమెంట్​ భవనం, పార్లమెంట్​ హౌస్​ అనెక్స్

పార్లమెంట్​ ఎస్టేట్​లో పార్లమెంట్​ భవనం, పార్లమెంట్​ హౌస్​ అనెక్స్​, పార్లమెంట్​ లైబ్రరీ భవనాలు ఉన్నాయి. 1927లో పార్లమెంట్​ భవనం, 1975లో పార్లమెంట్​ హౌస్​ అనెక్స్​, 2002లో పార్లమెంటరీ లైబ్రరీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్​ భవనానికి సర్​ ఎడ్విన్​ ల్యుటియన్స్​, సర్​ హెర్బర్ట్​ బేకర్లు ఆర్కిటెక్టులుగా పనిచేశారు. ఈ భవన నిర్మాణ శైలిని ల్యుటియన్స్​ వాస్తు శైలిగా పేర్కొంటారు.  పార్లమెంట్​ భవనానికి 1921లో అప్పటి వైస్రాయ్​ ​ ఛెమ్స్​ఫర్డ్​ శంకుస్థాపన చేయగా, 1927 జనవరి 18న వైస్రాయ్​​ లార్డ్​ ఇర్విన్​ ప్రారంభించారు.

నూతన భవనం

త్రిభుజాకారంలోని పార్లమెంట్​ భవనానికి 2020, డిసెంబర్​ 10న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. దీనిని సెంట్రల్​ విస్టా రీడెవలప్ మెంట్​ ప్రణాళికలో భాగంగా నిర్మిస్తున్నారు. కొత్త భవనాన్ని ధోల్​పూర్​ మైన్స్​లో లభిస్తున్న ఎర్ర ఇసుకరాయితో నిర్మిస్తున్నారు. దీన్ని టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​ చేపట్టింది. 

ప్రధాన భవనం: ఈ భవనం పైభాగంలో అశోకుని చక్రాని పోలిన 4 సింహాలు లాగే ఒక కాల చక్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాల చక్రం 24 గంటల సమయాన్ని, 365 రోజులను సూచిస్తుంది.
లోక్​సభ భవనం: ఈ భవనం సీటింగ్​ కెపాసిటీ 888. ఇందులో జాతీయ పక్షి నెమలిని థీమ్​గా డిజైన్​ చేస్తున్నారు.

రాజ్యసభ భవనం: ఈ భవనం సీటింగ్​ కెపాసిటీ 384. ఇందులో జాతీయ పుష్పం తామర డిజైన్ చేస్తున్నారు.

సెంట్రల్​ లాంజ్​: ఇందులో జాతీయ వృక్షం మర్రిచెట్టును థీమ్​గా డిజైన్​ చేస్తున్నారు.

సెంట్రల్​ కాన్​స్టిట్యూషన్ హాల్​: ఇది గత చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది.