మితిమీరిపోయారుగా: జీన్స్, లో దుస్తుల్లో దాచి గోల్డ్​ స్మగ్లింగ్

మితిమీరిపోయారుగా: జీన్స్, లో దుస్తుల్లో దాచి గోల్డ్​ స్మగ్లింగ్

బంగారం అక్రమంగా రవాణా చేయడానికి పలువురు ఎంచుకుంటున్న దారులు చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. విదేశాల నుంచి బంగారాన్ని హైదరాబాద్​కి తరలిస్తూ ఎయిర్​పోర్ట్​లో పట్టుబడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. 

రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​లో జులై 27న గోల్డ్​ స్మగ్లింగ్​ చేస్తూ ప్యాసింజర్లు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలేషియా నుంచి హైదరాబాద్​కి వచ్చిన ప్రయాణికులు జీన్స్, లోదుస్తుల్లో బంగారం పేస్ట్​ని దాచి స్మగ్లింగ్​చేయడానికి ప్రయత్నించారు. 

ఎయిర్​పోర్ట్​ అధికారులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి  నుంచి రూ.94 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటనలో సిగరెట్లు..

ఇదే రోజు దుబాయి నుంచి హైదరాబాద్​కి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఎయిర్​పోర్ట్​అధికారులు 34 వేల 800 నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.