‘వందేభారత్’లో భాగంగా ఇండియాకు చేరిన మరో ఫ్లైట్

‘వందేభారత్’లో భాగంగా ఇండియాకు చేరిన మరో ఫ్లైట్

కరోనా నేపథ్యంలో వివిధ దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను ప్రభుత్వం వందేభారత్ మిషన్ పథకం కింద ఇండియాకు తీసుకొస్తుంది. ఆ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎయిరిండియా ప్రత్యేక విమానంలో 181మంది భారతీయులను బహ్రెయిన్‌ నుంచి తిరువనంతపురానికి తీసుకొచ్చారు. వీరంతా కొజికోడ్‌ మీదుగా తిరువనంతపురానికి చేరుకున్నారు. భారతీయులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లెట్‌ ఐఎక్స్‌-1574ను ఏర్పాటు చేసింది. ఇందులో 181మంది ప్రయాణికులతో పాటు మరో ఇద్దరు శిశువులు కూడా స్వదేశానికి చేరుకున్నారు. గత నెలలో మే 7న ప్రారంభమైన వందేభారత్‌ మిషన్‌ పథకం కింద ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 2,50,087మంది ఇండియాకు చేరుకున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. ప్రస్తుతం మూడో విడత వందేభారత్‌ మిషన్‌ కొనసాగుతోంది.

For More News..

వీడియో: 40 ఏళ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకున్న 93 ఏళ్ల మహిళ

కర్ణాటక ప్రభుత్వానికి రూ. 10 లక్షల ఫైన్

మీకు అది రాజనీతి అవుతుందా? బీజేపీ జాతీయాధ్యక్షుడికి హరీష్ రావు ప్రశ్న