
లక్డీకాపూల్లోని నిలోఫర్ హాస్పిటల్ పరిసరాలు మళ్లీ ఇరుకుగా మారాయి. కనీసం అంబులెన్స్ లు వచ్చి, పోయే దారి కూడా ఉండడం లేదు. మెయిన్గేట్, లేబర్ రూమ్ లకు వెళ్లేదారిలో తోపుడు బండ్లు, ఆటోలు, బైక్లు అడ్డంగా నిలుపుతుండడంతో చాలా ఇబ్బందిగా ఉంటోందని పేషెంట్లు, వారి సహాయకులు, హాస్పిటల్ స్టాఫ్చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సమస్య తీవ్రంగా ఉంటోందని అంటున్నారు. సిటీతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి డైలీ వందల మంది నిలోఫర్కు వస్తుంటారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గతంలో అధికారులు తోపుడు బండ్లను తొలగించగా, స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరువ్యాపారులు ధర్నా చేశారు. మూడు నెలల నుంచి పొద్దున్నే బండ్లు తెచ్చి పెడుతున్నారు.- వెలుగు, హైదరాబాద్