పాట్నాలో ఓ వ్యక్తిని కాల్చిచంపిన దుండగులు

పాట్నాలో ఓ వ్యక్తిని కాల్చిచంపిన దుండగులు

పాట్నా: పాట్నాలో ఓ వ్యాపారవేత్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కేక్ షాపు యజమాని పురుషోత్తమ్ కుమార్ (50) రాత్రి 7.30 గంటల సమయంలో తన షాపు వైపు వెళ్తుండగా..దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న పురుషోత్తమ్ ను హస్ తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా తెలిపారు డాక్టర్లు. ఘటనాస్థలంలో మందుగుండును స్వాధీనం చేసుకున్నామన్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి..అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. డాక్ బంగ్లారోడ్ కు సమీపంలో సూర్యాఅపార్ట్ మెంట్ వద్ద ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.