ప్రతిరోజు పండగే మూవీతో హిట్ కొట్టిన సాయిథరమ్ తేజ్ దేవకట్ట డైరెక్షన్ లో మరో కొత్త సినిమా చేస్తున్నాడు. నివేథా పేతురాజు హీరోయిన్ గా నటిస్టున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజకార్యక్రమాలు ఇవాళ జరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్ లో భాగంగా క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. అల్లు అరవింద్, వంశీపైడిపల్లి, బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
see more news