కొండగట్టుకు చేరుకున్న పవన్

 కొండగట్టుకు చేరుకున్న పవన్

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు పవన్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు పవన్ ప్రచార రథం వారాహికి వాహన పూజ నిర్వహించారు. 

కొండగట్టు ఆంజనేయస్వామి అంటే పవన్ కు ఎంతో భక్తి.. ఏదైనా కార్యక్రమానికి ముందు ఆయన కొండగట్టు ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. కాగా, పవన్ వస్తున్న నేపథ్యంలో కొండగట్టులో కోలాహలం నెలకొంది. జనసైనికులు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు చేరుకున్నారు. పవన్ కు ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. ఆయనను అభిమానులు ఘన స్వాగంత పలికారు.