ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు జనసేన అధినేత,నటుడు పవన్ కల్యాణ్. మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు ఇవాళ(ఆధివారం) నరసాపురం వచ్చారు. ఆయన రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నది మొదలు...నరసాపురం చేరుకునేవరకు అభిమానులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.పవన్ కోసం జనసైనికులు,ఫ్యాన్స్ పోటెత్తారు. ఇందులో భాగంగానే.. నరసాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ సందర్భంగా పవన్ తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు.
నరసాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్..తన వాహనంపై నిల్చుని .. అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేస్తున్నారు. ఇంతలో ఓ అభిమాని అకస్మాత్తుగా పవన్ ఉన్న వాహనంపైకి వచ్చాడు. అతడు వేగంగా దూసుకువచ్చి పవన్ ను ఢీకొట్టాడు. దాంతో పవన్ ఒక్కసారిగా పడిపోయారు. అయితే ఆయన కారుపైనే కూలబడడంతో ప్రమాదం తప్పినట్టయ్యింది. ఆ తర్వాత పైకి లేచి యథావిధిగా ముందుకు సాగారు పవన్.
మరిన్ని వార్తల కోసం..