న్యూఢిల్లీ: ఫిన్టెక్ సంస్థ పేటీఎం పేరెంట్కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. క్యాష్ ఫ్లోస్ పెంచడం, ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. సంస్థ "ఏఐ-ఆధారిత ఆటోమేషన్" సామర్థ్యాన్ని పెంచడం వల్ల చాలా మంది ఉద్యోగుల అవసరం తగ్గిపోయిందని పేర్కొన్నాయి.
పేటీఎం ప్రధాన చెల్లింపుల వ్యాపారంతో రాబోయే సంవత్సరంలో 15,000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది మేలో వాటాదారులకు వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ లేఖ రాశారు. పేటీఎం తదుపరి టార్గెట్ సమీప భవిష్యత్తులో ఉచిత- నగదు- ప్రవాహాన్ని సానుకూలంగా ఉంచడమేనని పేర్కొన్నారు.