ఇసుక మాఫియాపై సీఎంకు ఫిర్యాదు చేస్తా : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఇసుక మాఫియాపై సీఎంకు ఫిర్యాదు చేస్తా : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • ఇటీవల ఇసుక లారీ ఢీకొని  ఒకరి మృతి 
  • బాధిత కుటుంబానికి ఎంపీ పరామర్శ


హైదరాబాద్:  జయశంకర్​భూపాలపల్లి కాటారంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై సీఎం, మంత్రి శ్రీధర్​బాబుకు ఫిర్యాదు చేస్తామని, ఇసుక అక్రమార్కులను వదిలే ప్రసక్తి లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.  జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన రాజలింగు అనే వ్యక్తిని ఇటీవల ఇసుక లారీ ఢీకొట్టి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్థానిక నాయకులతో కలిసి కాటారంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.  

ఈ క్రమంలో జరిగిన ఘటనపై ఆరా తీశారు.  అక్రమ ఇసుకదందాపై ఎంపీ ఫైర్​అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఇసుక దందాతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమ దందాను ప్రోత్సహించదన్నారు.  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.