
పెద్దపల్లిలో గులాబీ నేతలమధ్య రగడ మొదలైంది. జిల్లాపార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తరువాత కొంతమంది నేతలు కవితతలో ఫొటోలు దిగేందుకు సిద్దమయ్యారు. ఫొటో సెషన్ లో భాగంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇంతకాలం బీఆర్ఎస్ నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరువర్గాల కార్యకర్తల బూతు పురాణాన్ని చదివారు. ఉద్రిక్త పరిస్థితులు పెచ్చు మీరుతున్న తరుణంలో ద్వితీయ శ్రేణి నాయకులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల కార్యకర్తలకు నచ్చజెచ్చి శాంతింపజేశారు.