పెండింగ్ స్కాలర్ షిప్విడుదల చేయాలి

పెండింగ్ స్కాలర్ షిప్విడుదల చేయాలి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు : పెండింగ్​స్కాలర్​షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక వినాయక్​ చౌక్​లో రాస్తారోకో నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు స్కాలర్​షిప్​లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్కాలర్​షిప్ విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ కైరి శశి, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.