పాత బిల్డింగుల్లో బిక్కుబిక్కుమంటూ

పాత బిల్డింగుల్లో బిక్కుబిక్కుమంటూ

అద్దెలు భరించలేక పేద, మధ్య తరగతివాళ్లు 50 ఏళ్లు పైబడ్డ భవనాల్లో భయంగా బతుకుతున్నారు. అవి ఎప్పుడు కూలతాయో తెలియదు. మొన్నామధ్య సౌత్​ ముంబైలోని డోంగ్రి ప్రాంతంలో ఓ ఇల్లు కూలి 16 మంది చనిపోగా 9 మంది గాయపడ్డారు. ఆ నగరంలో ఇలాంటి బిల్డింగ్​లు 14 వేల చిల్లర ఉన్నట్లు లెక్కలను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై మొత్తం మీద రోజూ ఎక్కడో ఓ చోట కనీసం ఓ నిర్మాణం నేలకొరుగుతోంది. దీంతో బాధితులు ‘హెల్ప్​.. హెల్ప్​.. ’ అంటూ ఫైర్​​ బ్రిగేడ్​ సెంటర్లకు ఎమర్జెన్సీ కాల్స్ చేస్తున్నట్లు​ ఆఫీసర్లు చెబుతున్నారు.

రేపోమాపో నేలమట్టమయ్యే ఇళ్లు 1969లో 19,642 ఉండేవి. ఆ సంఖ్య ఇప్పుడు 14,207కి తగ్గింది. హౌజ్​ ట్యాక్స్ రికార్డుల ప్రకారం ఆ బిల్డింగ్​లు 1969కి ముందు కట్టినవేనని ఆఫీసర్లు అంటున్నారు. ఈ ప్రమాదకర భవనాలను కూల్చివేయాలన్నా, మరమ్మతు చేయాలన్నా లీగల్​ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. దీనికి తోడు ‘ముంబై రిపేర్స్​ బోర్డ్​’కి బడ్జెట్ కొరత, తగిన రవాణా వసతులు లోపించటం, బిల్డింగ్​ల్లోని జనాలను వెంటనే ఖాళీ చేయించాలంటే వాళ్లకు ఎమర్జెన్సీ షెల్టర్లు లేకపోవటం వంటివి సమస్యలుగా మారాయని తెలిపారు.

పబ్లిక్​ ఎక్కువ.. ప్లానింగ్​ తక్కువ..

‘వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం రిపోర్ట్​–2017’ ప్రకారం ముంబై, సబర్బన్​ రీజియన్లలో ప్రస్తుతం కోటీ 20 లక్షల మందికి పైగా పబ్లిక్​ ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్​కి 31,700 మంది నివశిస్తున్నారు. పాపులేషన్​ డెన్సిటీ ఎక్కువ కలిగిన నగరాల్లో ముంబై ప్రపంచం​లోనే రెండో స్థానాని​కి చేరింది (44,500 మందితో ఢాకా తొలి ప్లేస్​లో ఉంది). ఇందులో మెజారిటీ పీపుల్​ (కొన్ని అంచనాల మేరకు 40 శాతం మంది పైనే) స్లమ్​ ఏరియాల్లో ఉంటున్నారు. ప్రకృతి, మానవ తప్పిదాలతో కూడిన విపత్తులకు ముంబై తరచూ గురవుతూ ఉంటుంది.

వరదలు ముంచెత్తటం, ఇళ్లు కూలటం, చెట్లు నేలకొరగటం, కొండచరియలు విరిగిపడటం; మురికివాడల్లో, బిల్డింగ్​ల్లో, ఆకాశాన్ని తాకేలా ఉండే అపార్ట్​మెంట్లలో, ఇండస్ట్రియల్​ యూనిట్లలో, ట్రాన్స్​పోర్ట్​ వెహికిల్స్​లో అగ్ని ప్రమాదాలు; టెర్రరిస్ట్​ ఎటాక్​లు కూడా ఈ పాత నగరంలో ఎక్కువే. సిటీలో హారిజాంటల్ గ్రోత్​​కి బదులు వర్టికల్​డెవలప్​మెంట్ అధికంగా జరుగుతోంది. దీంతో జనాభా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఫలితంగా సరైన ప్లానింగ్ లేకుండా, సేఫ్టీ చర్యలు​ తీసుకోకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు తప్పుపడుతున్నారు.

డైలీ 40 ఎమర్జెన్సీ కాల్స్​

ముంబై ఫైర్​ బ్రిగేడ్​కి గత ఆరేళ్లలో (2018–19 నాటికి) దాదాపు లక్ష (99,393) ఎమర్జెన్సీ కాల్స్​ వచ్చాయి. ఇందులో ఇళ్లు కూలిన ప్రమాదాలకు సంబంధించిన కాల్స్ 1830 (1.8 శాతం). దీన్ని బట్టి ఏటా యావరేజ్​గా  300కు పైనే నిర్మాణాలు నేలకొరిగినట్లు అర్థమవుతోంది. ఇందులో చిన్న చిన్న గోడలు కూలినవి, బిల్డింగ్​లో ఒక పార్ట్​ (పిట్టగోడలు, ఎక్స్​టెన్షన్లు, చెక్క నిర్మాణాలు) కొలాప్స్​ కావటం, చెట్లు నేలమట్టం కావటం; మనుషులు లేదా జంతువులు ప్రమాదంలో చిక్కుకోవటం, ఫైర్​ యాక్సిడెంట్లు వంటివి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.

పాడైన సామగ్రితో ప్రమాదాలు

అగ్ని ప్రమాదాలకు సంబంధించిన కాల్స్​ ఏటా పది శాతం పెరిగాయి. గడిచిన ఆరేళ్లలో ఏటా ముంబై ఫైర్​ బ్రిగేడ్​కి సుమారు ఐదు వేల ఫైర్​ కాల్స్ వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు. ఇందులో షార్ట్​ సర్క్యూట్లు చాలా కామన్​ అయ్యాయని తెలిపారు. ముంబైలో ఇప్పటికీ భారీ అపార్ట్​మెంట్లు వెలుస్తున్నాయి. వీటితోపాటు ఓల్డ్​ బిల్డింగ్​లు, ఓల్డ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పాత భవనాల్లో కాలం చెల్లిన వైరింగ్ ఉంటుంది. ఎలక్ట్రికల్​ ప్యానెల్స్​ ఎక్కువ శాతం మెట్ల కిందే దర్శనమిస్తాయి.

ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులను బయటకు తీసుకురావటానికి సరైన ఏర్పాట్లు ఉండవు. ఫలితంగా ఫైర్​ యాక్సిడెంట్​ చోటుచేసుకుంటే మంటల కన్నా పొగ వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇలాంటివాటిని నివారించాలంటే బాధితులను తరలించటానికి తగిన ప్రణాళికలు, మార్గాలు ఉండాలి. ముంబైలోని చాలా అపార్ట్​మెంట్లలో ఒకే ఒక మెట్ల మార్గం ఉంటుంది. 15 మీటర్లకు పైగా ఎత్తున్న బిల్డింగుల్లో రెండు మెట్ల మార్గాలు ఉండాలని ఎక్స్​పర్ట్​లు సూచిస్తున్నారు.

డోంగ్రీ ఏరియాలో రోడ్డు వెడల్పు 1.5–2 మీటర్ల వరకే ఉండటంతో నేషనల్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​ సహాయ చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముంబైలో కిలోమీటర్​ ప్లేస్​లో 510 కార్లు నిలుపుతున్నారు. దేశంలో కార్లు ఇంత భారీ సంఖ్యలో ఉన్న నగరం ఇదేనని 2018 ట్రాఫిక్​ ఇండెక్స్​ తెలిపింది. ఈ సర్వేను 56 దేశాల్లోని 403 సిటీల్లో ట్రాఫిక్​ ఫ్లోపై నిర్వహించారు. ఈ ట్రాఫిక్​ కష్టాలను తగ్గించటానికి, ఎమర్జెన్సీ కాల్స్​కి క్విక్​ రెస్పాన్స్​ ఇవ్వటానికి గత ఏడాదిన్నర కాలంలో ముంబైలో 17 మినీ ఫైర్​ స్టేషన్లు ఏర్పాటుచేశారు.

 ఫైరింజన్​కు అందని అపార్ట్​మెంట్లు

ఆకాశాన్ని తాకుతున్నాయా అనేంత ఎత్తులో కట్టిన అపార్ట్​మెంట్లు ముంబైలో 130 చిల్లర ఉన్నాయి. వీటిలో కొన్నింటి హైట్​ 100 మీటర్ల (30 అంతస్తుల) నుంచి 250 మీటర్ల(70 అంతస్తుల)కు పైనే. ఫైర్​ బ్రిగేడర్లు వాడే నిచ్చెనల ఎత్తు 90 మీటర్లు మించదు. వాటితో 30 అంతస్తుల వరకు మాత్రమే ఎక్కగలరు. అందువల్ల 24‌0‌‌–300 మీటర్ల హైట్​ ఉండే బిల్డింగ్​ల్లోకి ఎక్కే నిచ్చెనలు ప్రపంచంలో ఎక్కడా దొరకవని ఫైర్​ సేఫ్టీ విభాగం వర్గాలు అంటున్నాయి. ఆ భవనాల్లో ప్రమాదాలు జరిగితే బాధితులను రక్షించటం దాదాపు అసాధ్యమని చెబుతున్నాయి.

అపార్ట్​మెంట్లలో ఎయిర్​ క్వాలిటీ మేనేజ్​మెంట్​, వాటర్​ మేనేజ్​మెంట్​; డ్రైనేజీ, సీవేజ్​ మేనేజ్​మెంట్​; ట్రాఫిక్​ మేనేజ్​మెంట్​కి సరైన ఏర్పాట్లు ఉండాలి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు బిల్డింగుల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలంటే చుట్టుపక్కల రోడ్ల వెడల్పు కనీసం 6 మీటర్ల నుంచి 9 మీటర్ల వరకు ఉండాలని నేషనల్​ బిల్డింగ్​ కోడ్ సూచిస్తోంది. ఆరు మీటర్లు ఉన్నా సరిపోతుంది. కానీ ఫైరింజన్లు, ఫైర్​ ట్రక్కులు లోపలికి వెళ్లటానికి, బయటకు రావటానికి రోడ్డు మరో మూడు మీటర్ల వెడల్పు ఉంటే ఇబ్బంది ఉండదు.