ఈ ఇద్దరిని గుర్తించి చెప్పితే రూ. 50,000 బహుమానం

ఈ ఇద్దరిని గుర్తించి చెప్పితే రూ. 50,000 బహుమానం

ఓ ఇద్దరు యువకులు ఓ కుక్కకు తాడు కట్టి చెరువులోకి విసిరేస్తారు. దీంతో తన ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ కుక్క ప్రయత్నం చేయగా గట్టున ఉన్న ఆ ఆకతాయిలు రాళ్లతో కుక్కని కొట్టారు. ఆ కుక్క ప్రాణాల్ని విడిచినట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోపై పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యువకుల్ని పట్టిస్తే 50 వేల రూపాయలు ఇస్తామని నజరానా ప్రకటించింది. వారి వివరాలు తెలిసిన వాళ్ళు ’91 9820122602′ మొబైల్ నంబర్ కు లేదంటే e-mail Info@petaindia.org లకు నేరుగా సమాచారం ఇవ్వాలని కోరింది.  ఆ ఆకతాయిల గురించి సమాచారం అందించిన వ్యక్తులకు ఎటువంటి హాని జరగకుండా వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.