కరెంటు బిల్లులను తగ్గించడానికి బిజ్లీ బడ్డీ

 కరెంటు బిల్లులను తగ్గించడానికి బిజ్లీ బడ్డీ

హైదరాబాద్, వెలుగు: ఐటీ  కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ (ఇచా)తో కలిసి పేయింగ్ గెస్ట్,  కో-లివింగ్ బుకింగ్ సర్వీస్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ పీజీఓ తమ హాస్టళ్లలో మీటరింగ్ సొల్యూషన్ "బిజ్లీ బడ్డీ"ని ప్రారంభించినట్లు వెల్లడించింది. రేడియస్ సినర్జీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్​ఎస్​ఐపీఎల్​) మీటర్లను సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఇవి ఒక ఎంఓయూపై సంతకం చేశాయి. హైదరాబాద్ హాస్టల్స్,  పేయింగ్ గెస్ట్ (పీజీ)లలో బిజ్లీ బడ్డీని అమర్చుతారు. ఈ ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్ల కారణంగా హాస్టల్ ​యూజర్లు తక్కువగా కరెంటును వాడుతారని, బిల్స్​ తక్కువగా వస్తాయని ఈ మూడు సంస్థలు ప్రకటించాయి.  హైదరాబాద్ హాస్టళ్లలో దాదాపు రెండు లక్షల మీటర్లు బిగించాలని, ఫలితంగా నెలకు 7 మిలియన్​ యూనిట్ల కరెంటును ఆదా చేయవచ్చని  ఇచా జనరల్ సెక్రటరీ తాతా కరుణాకర్ చెప్పారు. సాధారణ మీటర్లతో పోలిస్తే బిజ్లీ బడ్డీ ద్వారా 15 శాతం వరకు కరెంటు ఆదా అవుతుందని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల మీటర్లను ఇన్​స్టాల్​ చేశామని, మరో రెండు లక్షల మీటర్లను త్వరలో ఇన్​స్టాల్​​ చేస్తామని వివరించారు.