బారామతి విమాన ప్రమాదం..అజిత్ పవార్ రెండేళ్ల క్రితం చేసినట్వీట్ వైరల్ 

బారామతి విమాన ప్రమాదం..అజిత్ పవార్ రెండేళ్ల క్రితం చేసినట్వీట్ వైరల్ 

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్​ చనిపోయిన కొన్ని గంటల తర్వాత విమానం ల్యాండింగ్ గురించి ఆయన రెండేళ్ల క్రితం చేసినట్వీట్​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. విమానం ల్యాండింగ్ పై 2024లో అజిత్​ పవార్​ చేసిన వ్యంగ్య పోస్ట్​ బయటపడింది. ఈపోస్టును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. 

వైరల్ అవుతున్న ఈ పోస్టులో అజిత్ పవార్​ ఇలారాశారు. మనం ప్రయాణిస్తున్న విమానం లేదా హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్​ అయితే .. పైలట్​ ఒక మహిళ అని అర్ధమవుతుందని వ్యంగ్యంగా రాశారు. 

విమాన ప్రయాణంలో మహిళల పాత్రను ప్రాముఖ్యతను తెలియజెప్పుతూ కొంచెం 2024లో పోస్ట్ చేశారు అజిత్ పవార్​. అయితే ఈ విషాద సంఘటన తర్వాత వ్యంగ్యంగా, కొంచెం విచిత్రంగా మరోసారి చర్చలోకి వచ్చిందని ఈ ట్వీట్‌ను నెటిజన్లు ఆశ్చర్యంతో చూస్తున్నారు. అజిత్​ పవార్​కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు.