విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చనిపోయిన కొన్ని గంటల తర్వాత విమానం ల్యాండింగ్ గురించి ఆయన రెండేళ్ల క్రితం చేసినట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం ల్యాండింగ్ పై 2024లో అజిత్ పవార్ చేసిన వ్యంగ్య పోస్ట్ బయటపడింది. ఈపోస్టును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
వైరల్ అవుతున్న ఈ పోస్టులో అజిత్ పవార్ ఇలారాశారు. మనం ప్రయాణిస్తున్న విమానం లేదా హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయితే .. పైలట్ ఒక మహిళ అని అర్ధమవుతుందని వ్యంగ్యంగా రాశారు.
విమాన ప్రయాణంలో మహిళల పాత్రను ప్రాముఖ్యతను తెలియజెప్పుతూ కొంచెం 2024లో పోస్ట్ చేశారు అజిత్ పవార్. అయితే ఈ విషాద సంఘటన తర్వాత వ్యంగ్యంగా, కొంచెం విచిత్రంగా మరోసారి చర్చలోకి వచ్చిందని ఈ ట్వీట్ను నెటిజన్లు ఆశ్చర్యంతో చూస్తున్నారు. అజిత్ పవార్కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు.
