బారామతి విమాన ప్రమాదం..అజిత్ పవార్ రెండేళ్ల క్రితం చేసినట్వీట్ వైరల్ 

బారామతి విమాన ప్రమాదం..అజిత్ పవార్ రెండేళ్ల క్రితం చేసినట్వీట్ వైరల్ 

మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్​ చనిపోయిన తర్వాత వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ రెండేళ్ల క్రితం విమానం ల్యాండింగ్​ పై చేసిన ఓ ట్వీట్​ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది. 

2024లో చేసిన ఆ ట్వీట్​ లో .. మన ప్రయాణిస్తున్న విమానం, లేదా హెలికాప్టర్​ సురక్షితంగా ల్యాండ్​ అయితే  పైలట్ ఒక మహిళ అని అర్థం చేసుకోవచ్చు. అంటూ వ్యంగ్యంగా రాశారు పవార్​. మహిళా పైలట్ల నైపుణ్యాన్ని ప్రశంసించే ఉద్దేశంతో  చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. 

ఇప్పుడు బారామతి విమాన ప్రమాదం తర్వాత మరోసారి అదే ట్వీట్​ నెటిజన్లు తిరిగి షేర్​చేశారు. కాలానుగుణంగా ఈ ట్వీట్​ మరో అర్థాన్ని ఇవ్వడంతో సోషల్ మీడియాలో చాలా స్పందన వచ్చింది. కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా మరికొందరు అప్పటి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నెట్టింట పెద్ద చర్చ పెట్టారు. ఇంకొందరు అజిత్​ పవార్​కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు.