హారర్‌‌‌‌ మూవీ ‘పిండం’ ట్రైలర్‌‌‌‌ విడుదల

హారర్‌‌‌‌ మూవీ ‘పిండం’ ట్రైలర్‌‌‌‌ విడుదల

హారర్‌‌‌‌ జానర్‌‌‌‌లో మరో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘పిండం’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించగా, సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించాడు.  యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. గురువారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఓ పాత ఇంట్లోకి వచ్చిన శ్రీరామ్ కుటుంబానికి అనుకోని సంఘటనలు ఎదురవడంతో ఈశ్వరీరావును సంప్రదిస్తారు.

‘మీ కుటుంబాన్ని వేధిస్తున్నది ఒక్క ఆత్మ కాదు’ అనే డైలాగ్‌‌తో ఆ ఆత్మల కథేమిటి, వాటి నుంచి ఆ  కుటుంబం తప్పించుకుందా అనే ఆసక్తి మొదలైంది. ‘దెయ్యం ఎప్పుడూ నీతో మాట్లాడదు.. నీ మాటలని వింటూ ఉంటుంది అంతే’ అనే మాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలో కనిపించాడు. 1930, 1990, ప్రస్తుత కాలాలలో ఈ కథ జరుగుతుందని, స్క్రీన్‌‌ప్లే హైలైట్‌‌ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. డిసెంబర్ 15న సినిమా విడుదల కానుంది.