యూట్యూబ్​లో కొత్త అప్​డేట్​.. ఆగకుండా అర నిమిషం యాడ్స్

యూట్యూబ్​లో కొత్త అప్​డేట్​.. ఆగకుండా అర నిమిషం యాడ్స్

యూట్యూబ్​లో కొత్త అప్​డేట్​ వచ్చింది. కాకపోతే అది అందరికీ నచ్చకపోవచ్చు. చాలామందికి అది విసుగొచ్చే అప్​డేట్ అనిపించొచ్చు. ఎందుకంటారా... ఆ అప్​డేట్​ అలాంటిది మరి.యూట్యూబ్ తీసుకొచ్చిన ఆ కొత్త అప్​డేట్ ఏంటంటే.. మామూలుగా యూట్యూబ్​లో ఒక వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. అవి వచ్చేది కొన్ని సెకన్ల పాటే అయినా, చాలామంది వ్యూయర్స్​కి చిరాగ్గా అనిపిస్తుంది. దాంతో చాలామంది స్కిప్​ చేస్తుంటారు. 

కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన అప్​డేట్​తో ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకాస్త పెరగొచ్చు. ఎందుకంటే.. కనెక్టెడ్​ టీవీ (సీటీవీ) లలో 30 సెకన్ల పాటు నాన్​–స్కిప్​ యాడ్​లను తీసుకురాబోతున్నట్లు యూట్యూబ్​ ప్రకటించింది. బిగ్​ స్క్రీన్​పై ఎక్కువ రన్​టైం ఉన్న యాడ్స్​కు అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి ఆడియెన్స్​కి నచ్చుతాయని నమ్మకంగా చెప్తోంది. టీవీ స్క్రీన్​పై యూట్యూబ్​ సెలెక్టెడ్​ వ్యూయర్స్ పెరుగుతుండడంతో ఇందులో రకరకాల కంటెంట్​లు ప్రసారమయ్యే టైంలో యాడ్స్ టెలికాస్ట్ చేసుకునేందుకు యూట్యూబ్​ అవకాశం కల్పించింది.