ఐటీ హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎల్‌‌‌‌‌‌‌‌ఐ కోసం 58 కంపెనీలు​

ఐటీ హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎల్‌‌‌‌‌‌‌‌ఐ కోసం 58 కంపెనీలు​

న్యూఢిల్లీ: ఐటీ హార్డ్​వేర్​ పీఎల్​ఐ స్కీము కోసం 58 కంపెనీలు రిజిస్ట్రేషన్​ చేసుకున్నాయి. ఐటీ హార్డ్​వేర్​ కోసం ప్రకటించిన పీఎల్​ఐ స్కీము 2.0 కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్​ వచ్చినట్లు ఐటీ సెక్రటరీ అల్కేష్​ కుమార్​ శర్మ చెప్పారు. ఈ స్కీము కింద రిజిస్ట్రేషన్​కు ఆగస్టు 30 దాకా గడువు ఇచ్చారు. దేశంలోని కంపెనీలతో పాటు గ్లోబల్​ టాప్​ ప్లేయర్లు కూడా రిజిస్ట్రేషన్​ చేసుకున్నట్లు శర్మ తెలిపారు. పీఎల్​ఐ స్కీము 2.0 ల్యాప్​టాప్​లు, టాబ్లెట్స్​, ఆల్​ ఇన్​ వన్​ పీసీలు, సర్వర్లు, అల్ట్రా స్మాల్​ ఫార్మ్​ ఫ్యాక్టర్​ డివైజ్​లకు వర్తిస్తుందని పేర్కొన్నారు. 

ఇండియాలో ఐటీ హార్డ్​వేర్​ మాన్యుఫాక్చరింగ్​ ఎకోసిస్టమ్​ను బలోపేతం చేయడమే స్కీము లక్ష్యమని వివరించారు. ఈ ఏడాది మే నెలలో కేంద్ర కేబినెట్​ ఐటీ హార్డ్​వేర్​  పీఎల్​ఐ స్కీము కోసం రూ. 17 వేల కోట్ల ఇన్సెంటివ్స్​ను  ఆమోదించింది. రాబోయే ఆరేళ్లలో ఈ స్కీము రూ. 3.35 లక్షల కోట్ల విలువైన ప్రొడక్షన్​ను సాధించగలుగుతుందని అంచనా వేస్తున్నారు.