
న్యూఢిల్లీ: ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ స్కీము కోసం 58 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఐటీ హార్డ్వేర్ కోసం ప్రకటించిన పీఎల్ఐ స్కీము 2.0 కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్లు ఐటీ సెక్రటరీ అల్కేష్ కుమార్ శర్మ చెప్పారు. ఈ స్కీము కింద రిజిస్ట్రేషన్కు ఆగస్టు 30 దాకా గడువు ఇచ్చారు. దేశంలోని కంపెనీలతో పాటు గ్లోబల్ టాప్ ప్లేయర్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు శర్మ తెలిపారు. పీఎల్ఐ స్కీము 2.0 ల్యాప్టాప్లు, టాబ్లెట్స్, ఆల్ ఇన్ వన్ పీసీలు, సర్వర్లు, అల్ట్రా స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ డివైజ్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇండియాలో ఐటీ హార్డ్వేర్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడమే స్కీము లక్ష్యమని వివరించారు. ఈ ఏడాది మే నెలలో కేంద్ర కేబినెట్ ఐటీ హార్డ్వేర్ పీఎల్ఐ స్కీము కోసం రూ. 17 వేల కోట్ల ఇన్సెంటివ్స్ను ఆమోదించింది. రాబోయే ఆరేళ్లలో ఈ స్కీము రూ. 3.35 లక్షల కోట్ల విలువైన ప్రొడక్షన్ను సాధించగలుగుతుందని అంచనా వేస్తున్నారు.