దేశ ప్రజలకు మోదీ.. ' వాల్మికీ జయంతి' శుభాకాంక్షలు

దేశ ప్రజలకు మోదీ.. ' వాల్మికీ జయంతి' శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'వాల్మీకి జయంతి' సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సమానత్వం, సామరస్యంతో పాతుకుపోయిన ఆయన విలువైన ఆలోచనలు భారతీయ సమాజాన్ని పెంపొందించడంలో కొనసాగుతున్నాయని అన్నారు. మానవతా సందేశం ద్వారా వాల్మికి మన నాగరికత, సంస్కృతికి అమూల్యమైన వారసత్వ సంపదగా నిలిచిపోతారని చెప్పారు.

రామాయణాన్ని రచించి శ్రీరాముడి జీవితాన్ని ప్రజల హృదయాల్లో సజీవంగా ఉండేలా చేసిన మహాకవి వాల్మికి మహర్షిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గుర్తు చేసుకున్నారు. రామాయణంలో పురుషోత్తముడు రాముడి జీవితం చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన వ్యక్తి వాల్మికి అని, ఈ సందర్భంగా అందరికీ వాల్మికీ జయంతి శుభాకాంక్షలు అని తెలియజేశారు.

Also Read :- ముఖేష్ అంబానీకి బెదిరింపు మెయిల్