గుజరాత్ లోని ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన తీగలవంతెన (కేబుల్ బ్రిడ్జి) ని ప్రధాని మోదీ ఆదివారం (ఫిబ్రవరి 25) ప్రారంభించారు. ‘సుదర్శన సేతు’ పేరుతో రూ. 979 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఓఖా, బేట్ ద్వారకా ద్వీపాలను కలుపుతూ ఈ బ్రిడ్రిని నిర్మించారు. 2017 అక్టోబర్ లో 2.3 కిలోమీటర్ల వంతెనకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇది కొత్త ద్వారక, పాత ద్వారక మధ్య లింక్ గా ఉంటుంది.
సుదర్శన్ సేతు ఓ ప్రత్యేకమైన డిజైన్.. భగద్గీతలోని శ్లోకాలులతో అలంకరించబడిన ఫుట్ పాత్, రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంటాయి. ఈ తీగల బ్రిడ్జి వెడల్పు 27.20 మీటర్లు, నాలుగు లేన్ల రోడ్డు తో రెండు వైపులా 2.5 మీటర్ల వెడల్పు గల ఫుట్ పాత్ కలిగి ఉంటుంది.
గతంలో సిగ్నేచర్ బ్రిడ్జ్ గా పిలువబడిన ఈ వంతెనకు సుదర్శన్ సేతు (సుదర్శన్ బ్రిడ్జి) అని పేరు పెట్టారు. బేట్ ద్వారక అనేది ఓఖా పోర్ట్ సమీపంలో ఉన్న ఓ ద్వీపం. ఇది ద్వారకా పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారాదీష్ దేవాలయం ఉంది.
Prime Minister Narendra Modi tweeted "Delighted to inaugurate Sudarshan Setu today - a bridge that connects lands and people. It stands vibrantly as a testament of our commitment to development and progress." pic.twitter.com/wA92bffQBx
— ANI (@ANI) February 25, 2024