
- కొత్త ఐఏఎస్ ఆఫీసర్లకు ప్రధాని మోడీ సూచన
‘‘మీరంతా యంగ్ ఆఫీసర్లు. ఫ్రెష్ మైండ్తో సర్వీసులో చేరారు. అదే ఫ్రెష్నెస్ని పనిలో కూడా చూపించండి. ప్రజలకు ఏది మంచిదో ట్రైనింగ్తో తెల్సుకుని ఉంటారు. కాబట్టి సిటిజన్సెంట్రిక్ పర్స్పెక్టివ్లోనే మీకిచ్చే ప్రతి టాస్క్ను నిర్వహించండి” అంటూ యంగ్ ఆఫీసర్లకు ప్రధాని నరేంద్ర మోడీ సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రెటరీగా నియమితులైన 160 మంది ఐఏఎస్(2017బ్యాచ్) ఆఫీసర్లతో ఆయన సోమవారం ఇంటరాక్ట్ అయ్యారు. పీఎం అఫీషియల్ రెసిడెన్స్(7 లోకకల్యాణ్ మార్గ్)లో జరిగిన భేటీలో సహాయ మంత్రి జితేంద్ర సింగ్, పీఎంవో, పర్సనల్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆహ్లాదకరంగా జరిగిన ఇంటరాక్షన్లో ఆఫీసర్లంతా తమ క్లాస్రూమ్, ఫీల్డ్ ట్రైనింగ్ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. సీనియర్ ఆఫీసర్ల ఎక్స్పీరియన్స్కు జూనియర్ల కొత్త ఆలోచనలు తోడైతే సిస్టమ్ మరింత బలపడుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఇండియాలో సివిల్ సర్వీసుల ఆర్కిటెక్ట్గా పేరుపొందిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్పై ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో విజువల్ని కొత్త ఆఫీసర్ల కోసం ప్రదర్శించారు.