
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం సెప్టెంబర్ 21న రాత్రి ఆమోదం పొందింది. ఈ క్రమంలో మహిళా పార్లమెంటేరియన్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. బిల్లు ఆమోదం పొందినందుకు సంబరాలు చేసుకునేందుకు పలువురు మహిళా చట్టసభ సభ్యులతో ప్రధాని ఫొటో దిగారు. బిల్లు ఆమోదంలో ప్రధానమంత్రి నిర్ణయాత్మక నాయకత్వం వహించారని పలువురు మహిళా సభ్యులు ప్రశంసించారు.
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేసే బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా అనుకూలంగా ఓటు వేయడంతో పార్లమెంటు ఆమోదం పొందింది. లోక్సభలో కాకుండా, సభలో ఉన్న 456 మంది ఎంపీలలో ఇద్దరు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, రాజ్యసభలోని మొత్తం 215 మంది శాసనసభ్యులు సెప్టెంబర్ 21న గురువారం నాడు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.
మహిళా ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం
బిల్లు ఆమోదం పొందిన తర్వాత, చట్టానికి మద్దతు ఇచ్చినందుకు చట్టసభ సభ్యులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. "నారీ శక్తి వందన్ అధినియం ఆమోదం పట్ల పూర్తిగా పులకించిపోయిన మా డైనమిక్ మహిళా ఎంపీలను కలుసుకున్నందుకు గౌరవం ఉంది" అని ఆయన ఈ సందర్భంగా ఎక్స్ లో రాసుకువచ్చారు. మార్పు కోసం టార్చ్ బేరర్ లా నిలిచిన వారు.. తాము రూపొందించిన చట్టాన్ని పురస్కరించుకుని సంబరాలు చేసుకోవడం సంతోషకరమని అన్నారు.
128వ రాజ్యాంగ సవరణ బిల్లును నారీ శక్తి వందన్ అధినియం అని పిలుస్తారు. ఇప్పుడు దీనికి మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం. జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేయడానికి డీలిమిటేషన్ తర్వాత ఇది అమలు కానుంది. ఇది వచ్చే ఏడాది నుంచి అమలు కానుందని ప్రభుత్వం తెలిపింది.
Had the honor of meeting our dynamic women MPs who are absolutely thrilled at the passage of the Nari Shakti Vandan Adhiniyam.
— Narendra Modi (@narendramodi) September 21, 2023
It is gladdening to see the torchbearers of change come together to celebrate the very legislation they have championed.
With the passage of the Nari… pic.twitter.com/et8bukQ6Nj