ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ పాల్గొన్న మోడీ

ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ పాల్గొన్న మోడీ

హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో 71వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తాను ఢిల్లీలో తరచుగా యువ ఐపీఎస్ అధికారులతో మాట్లాడుతుంటాను మోడీ అన్నారు. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది ఎవరినీ కలవలేకపోయానని ఆయన అన్నారు. తన పదవీకాలంలో మీ అందరినీ తప్పనిసరిగా కలుస్తాను అని మోదీ అన్నారు. విధి నిర్వహణలో ఐపీఎస్‌లంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

ఈ 71 బ్యాచ్‌కు చెందిన 131 మంది యువ ఐపీఎస్‌లకు 42 వారాల పాటు శిక్షణ ఇచ్చారు. వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. వీరందరికీ సైబర్ క్రైమ్, ఫోరెన్సిక్, ఇంటలిజెన్స్ మొదలగు వాటి గురించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ 131 మందిలో 11 మంది ఐపీఎస్‌లను తెలంగాణకు, అయిదుగురిని ఏపీకి కేటాయించారు.

For More News..

ఒకే జిల్లాలో వరుస అత్యాచారాలు.. 20 రోజుల్లో ముగ్గురు మైనర్లపై..

దేశంలో రెండోసారి 83 వేలు దాటిన కరోనా కేసులు

రియా చక్రవర్తి ఇంట్లో యాంటీ డ్రగ్ అధికారుల సోదాలు