
న్యూఢిల్లీ : టీచర్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ టీచర్లకు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. మన కలల సాకారం, భవిష్యత్ నిర్మాణంలో టీచర్లు కీలక పాత్ర పోషిస్తారని మెచ్చుకున్నారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ఎస్.రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డే జరుపుకుంటున్నామని ప్రధాని గుర్తు చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఆయనకు నివాళి అర్పించారు. టీచర్ల త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
7 లోక్ కల్యాణ్ మార్గ్లో 75మంది అవార్డు విజేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జాతీయ ఉత్తమ టీచర్స్ పురస్కార విజేతలను కలిసిన వీడియోను ఈ సందర్భంగా ప్రధాని మోదీ షేర్ చేశారు. దేశవ్యాప్తంగా స్కూళ్లల్లో భిన్న సంస్కృతి, సంప్రదాయాలపై ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా కోరారు. దేశంలోని యువత అభివృద్ధికి టీచర్లు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.