
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనల మీద ప్రధాని మోడీ స్పందించారు. ఈ చట్టాల విషయంలో అన్నదాతలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. ‘ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టిస్తూ, కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్న విపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టాలకు అనుకూలంగా వ్యవహరించాయి. వాళ్లు పవర్లో ఉన్నప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దేశం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సమయంలో వీళ్లు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైతు సోదరుల అనుమానాలను నివృత్తి చేయడానికి మేం 24 గంటలూ సిద్ధంగా ఉన్నాం. తొలి రోజు నుంచి రైతుల హితానికి మేం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని మోడి పేర్కొన్నారు.
मैं किसान भाई-बहनों से फिर कह रहा हूं कि उनकी हर शंका के समाधान के लिए सरकार 24 घंटे तैयार है।
किसानों का हित पहले दिन से हमारी सरकार की प्राथमिकता रहा है।
– पीएम @narendramodi #KutchWelcomesPMModi pic.twitter.com/Y0akSWoCMm
— BJP (@BJP4India) December 15, 2020