ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరగాల్సిందే

ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరగాల్సిందే

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించకపోవడంపై సీరియస్ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఐక్యరాజ్యసమితి జనరల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. భద్రతామండలిలో నిర్ణయాధికారం కోసం తాము ఇంకెంతకాలం వేచి చూడాలని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరగాల్సిందేనన్నారు. భద్రతకు విఘాతం కల్పించే శక్తులపై తాము పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు మోడీ.