మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను ఈ రోజు ప్రధాని మోడీ ప్రారంభించారు. కొన్ని నెలల నుంచి దేశ ప్రజలు కరోనాతో భయపడుతున్నారని.. ఇప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నో సవాళ్ళ మధ్య కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తెలుగు కవి గురజాడ అప్పారావు తెలుగులో రాసిన కవిత్వం వినిపించారు.

‘సొంత లాభం కొంత మానుకో..

పొరుగు వానికి తోడుపడవోయ్‌..

దేశమంటే మట్టి కాదోయ్‌..

దేశమంటే మనుషులోయ్’ అనే పద్యాన్ని మోడీ తెలుగులో వినిపించారు.

For More News..

గుండెపోటుతో పాండ్యా తండ్రి మృతి

కృష్ణ జింకలను వేటాడి అమ్మేందుకు యత్నం..

వాట్సాప్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 8న ఏ అకౌంట్ నిలిపివేయం