దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ను ఈ రోజు ప్రధాని మోడీ ప్రారంభించారు. కొన్ని నెలల నుంచి దేశ ప్రజలు కరోనాతో భయపడుతున్నారని.. ఇప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నో సవాళ్ళ మధ్య కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తెలుగు కవి గురజాడ అప్పారావు తెలుగులో రాసిన కవిత్వం వినిపించారు.
‘సొంత లాభం కొంత మానుకో..
పొరుగు వానికి తోడుపడవోయ్..
దేశమంటే మట్టి కాదోయ్..
దేశమంటే మనుషులోయ్’ అనే పద్యాన్ని మోడీ తెలుగులో వినిపించారు.