న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని.. కానీ బడ్జెట్ సెషన్స్ చాలా ముఖ్యమని చెప్పారు. ‘బడ్జెట్ సెషన్స్ చాలా ముఖ్యమనే విషయాన్ని అన్ని పార్టీల ఎంపీలకు తెలియజేస్తున్నా. ఎన్నికలతో వీటికి సంబంధం లేదు. అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ సెషన్స్ కు ఉండే ప్రాధాన్యత వేరు. ఈ సమావేశాల్ని ఫలవంతంగా జరిపేందుకు మేం ప్రయత్నిస్తాం. తద్వారా ఈ ఏడాది ఆర్థికంగా దేశం కొత్త ఎత్తులకు చేరుకుంటుందని ఆశిస్తున్నాం. త్వరలో ఎలక్షన్స్ (ఐదు రాష్ట్రాల ఎన్నికలు) ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ తో వీటికి ఏ సంబంధం లేదు. సభలో బహిరంగ చర్చలు జరగాల్సిన అవసరం ఉంది’ అని మోడీ పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం: